ఎంపీ సురేష్తో సఖ్యత దిశగా ఎమ్మెల్యే శ్రీదేవి
ABN , First Publish Date - 2020-09-21T17:22:44+05:30 IST
జిల్లాలో గ్రూపు రాజకీయాలకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గుంటూరు: జిల్లాలో గ్రూపు రాజకీయాలకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాపట్ల ఎంపీ నందిగం సురేష్తో సఖ్యత దిశగా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ముందుకు వెళ్తోంది. ఈ మేరకు ఎంపీ సురేష్ ఇంటికి ఉండవల్లి శ్రీదేవి కుటుంబ సమేతంగా వెళ్లింది. జిల్లాలో ఇప్పటి వరకు రెండు గ్రూపులుగా రాజకీయం సాగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల భేటీపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది.