మంచినీటి కోసం రోడ్డెక్కిన పల్నాడు వాసులు

ABN , First Publish Date - 2021-08-31T17:52:20+05:30 IST

మంచినీటి కష్టాలతో పల్నాడు వాసులు ఆందోళన బాట పట్టారు. జిల్లాలోని దాచేపల్లి మండలం

మంచినీటి కోసం రోడ్డెక్కిన పల్నాడు వాసులు

గుంటూరు: మంచినీటి కష్టాలతో పల్నాడు వాసులు ఆందోళన బాట పట్టారు. జిల్లాలోని దాచేపల్లి మండలం నడికూడిలో మంచినీటి కోసం మహిళలు నిరసనకు దిగారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా చేపట్టారు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు హామీలతో అధికారులు సరిపెడుతున్నారు. చివరకు మంచినీటి కష్టాలతో విసుగుచెందిన మహిళలు రోడ్డెక్కి తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-08-31T17:52:20+05:30 IST