మహిళపై ఆటో డ్రైవర్ దాష్టీకం..

ABN , First Publish Date - 2021-08-06T19:45:57+05:30 IST

గుంటూరు: మహిళపై ఓ ఆటో డ్రైవర్ దాడికి దిగిన ఘటన కలకలం రేపుతోంది.

మహిళపై ఆటో డ్రైవర్ దాష్టీకం..

గుంటూరు: మహిళపై ఓ ఆటో డ్రైవర్ దాడికి దిగిన ఘటన కలకలం రేపుతోంది. బాకీ అడిగినందుకు.. మహిళ అనే కనికరం లేకుండా  కాలితో తన్ని దాష్టీకం ప్రదర్శించాడు. తాడేపల్లి మహానాడులో కొంతకాలం జీవనం సాగించిన మహిళ.. ప్రస్తుతం విజయవాడ రాణిగారి తోటలో ఉంటోంది. మహానాడులో ఉండగా తాపీ మేస్త్రీగా పనిచేసే గోపీకృష్ణకు రూ. 3 లక్షలు అప్పు ఇచ్చింది. అప్పు తీర్చమని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడంతో ఆయనను నిలదీసింది. దీంతో ఆటో డ్రైవర్ మహిళపై దాడి చేశాడు.


ఆటో డ్రైవర్ దాడిలో మహిళకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు గోపీకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లాలో నిత్యం మహిళలపై దాడులు కొనసాగుతున్నాయనడానికి ఇదొక నిదర్శనంగా భావించవచ్చు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - 2021-08-06T19:45:57+05:30 IST