3 రాజధానుల అజెండాగా అసెంబ్లీ రద్దుకు సిద్ధమా: ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2020-08-07T10:43:23+05:30 IST

మూడు రాజధానులు, మూడు ముక్కలాట అజెండాగా అసెంబ్లీ రద్దుకు వైసీపీ సిద్ధమా అంటూ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రశ్నించారు.

3 రాజధానుల అజెండాగా అసెంబ్లీ రద్దుకు సిద్ధమా: ఎమ్మెల్సీ

మడకశిర టౌన్‌, ఆగస్టు 6: మూడు రాజధానులు, మూడు ముక్కలాట అజెండాగా అసెంబ్లీ రద్దుకు వైసీపీ సిద్ధమా అంటూ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రశ్నించారు. గురువారం  ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సవాల్‌ను   వైసీ పీ స్వీకరించలేకపోయిందన్నారు. ఒక పవిత్ర యజ్ఞంగా, పుణ్యకార్యక్రమంగా రాజధాని నిర్మాణం చేపట్టారన్నారు. అలాంటి రాజధానిని మూడు ముక్కలాటగా వైసీపీ చేసిందని విమర్శించారు. ప్రజల మనోభావాలు, ఆకాంక్షల మేరకే ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ప్రజల చెంతకే పరిపాలించాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడచుకోవాలన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆయన తెలియజేశారు.

Updated Date - 2020-08-07T10:43:23+05:30 IST