చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులో కాల్పుల కలకలం

ABN , First Publish Date - 2020-10-17T22:12:38+05:30 IST

చిత్తూరు: జిల్లాలోని కుప్పం సరిహద్దు ప్రాంతం తమిళనాడులో కాల్పుల కలకలం సృష్టించాయి.

చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులో కాల్పుల కలకలం

చిత్తూరు: జిల్లాలోని కుప్పం సరిహద్దు ప్రాంతం తమిళనాడులో  కాల్పుల కలకలం సృష్టించాయి. వివరాల్లోకెళితే.. తమిళనాడు నారాయణపురంలో డీఎంకే నేత వేలాయుధంపై కొందరు గుర్తు తెలియని దుండగులు నాటు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. నాటు తుపాకీ గుళ్ళు చొక్కా జేబులోని సెల్ ఫోన్‌కు‌ తగలడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. గుండెకు తగలాల్సిన బుల్లెట్ ఫోన్‌కు తగిలింది. అప్రమత్తమైన స్థానికులు ఆయన్ను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. కాల్పుల తర్వాత నిందితులు కుప్పం వైపు పరారైనట్లు తెలుస్తోంది.


స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేలాయుధంపై దాడి చేసిన ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు..? ఎందుకు దాడి చేశారు..? ఆయనతో ఎవరికైనా విబేధాలు అయినా ఉన్నాయా.. ? పాత కక్షల నేపథ్యంలోనే ఇలా దాడికి దిగారా..? అసలు వేలాయుధం ప్రత్యర్థులెవరు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2020-10-17T22:12:38+05:30 IST