గుజరాత్‌ స్కూళ్లలో గీతా బోధన

ABN , First Publish Date - 2022-03-19T08:02:12+05:30 IST

భగవద్గీతను పాఠ్యాంశాల్లో చేర్చాలని గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు ..

గుజరాత్‌ స్కూళ్లలో గీతా బోధన

అహ్మదాబాద్‌, మార్చి 18: భగవద్గీతను పాఠ్యాంశాల్లో చేర్చాలని గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల సిలబ్‌సలో భగవద్గీతను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేయనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీతూ వఘాని ప్రకటించారు. కేంద్రం ప్రకటించిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా.. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంచే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా స్వాగతిస్తూనే ఆ రాష్ట్ర మంత్రులను ఎద్దేవా చేశారు. ‘‘భగవద్గీతను సిలబ్‌సలో చేర్చడం గొప్ప ముందడుగే. అ యితే దీనిని ప్రవేశపెట్టినవారు ముందుగా ‘గీత’ ప్రవచించిన విలువలను ముందుగా ఆచరించాల్సిన అవసరం ఉంది’’ అని సిసోడియా పేర్కొన్నారు.

Updated Date - 2022-03-19T08:02:12+05:30 IST