IPL: టాస్ గెలిచిన గుజరాత్.. బెంగళూరు పోటీలో నిలిచేనా?

ABN , First Publish Date - 2022-05-20T00:59:34+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య చివరి

IPL: టాస్ గెలిచిన గుజరాత్.. బెంగళూరు పోటీలో నిలిచేనా?

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భాగంగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన టైటాన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. గుజరాత్ (Gujarat Titans) ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా, బెంగళూరు (Royal Challengers Bngalore)కు ప్లే ఆఫ్స్ అవకాశాలు మిణుకుమిణుకుమంటున్నాయి. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధించడంతో పాటు ఢిల్లీ కేపిటల్స్ జట్టు ఓటమి పాలైతే బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.


ఓడితే మాత్రం నేరగా ఐపీఎల్ నుంచి నిష్క్రమిస్తుంది. గుజరాత్ గెలిస్తే మాత్రం ఆ జట్టు ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరుతాయి. గుజరాత్ ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. అల్జారీ స్థానంలో లాకీ ఫెర్గ్యూసన్ జట్టులోకి వచ్చాడు. బెంగళూరు జట్టులోనూ ఒకే ఒక్క మార్పు చోటుచేసుకుంది. సిరాజ్ స్థానంలో సిద్ కౌల్ జట్టులోకి వచ్చాడు.

Updated Date - 2022-05-20T00:59:34+05:30 IST