గుజరాత్ లో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

ABN , First Publish Date - 2020-08-13T02:55:34+05:30 IST

గుజరాత్ లో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

గుజరాత్ లో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

గాంధీనగర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ గుజరాత్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రోజు కొత్తగా గుజరాత్ రాష్ట్రంలో 1152 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 74390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ కరోనా వల్ల 18 మంది మృతి చెందగా, కోవిడ్ వల్ల మొత్తం 2715 మంది చనిపోయారని ప్రభుత్వం పేర్కొంది. కరోనా నుంచి కోలుకొని 57,393 మంది డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం 14,282 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది.

Updated Date - 2020-08-13T02:55:34+05:30 IST