చాక్లెట్లు ఇచ్చి ముగ్గురు మైనర్ బాలికలపై వ్యక్తి అత్యాచారం
ABN , First Publish Date - 2020-10-09T14:08:31+05:30 IST
ఇంటికి పిలిచి చాక్లెట్లు, మిఠాయిలు ఇచ్చి ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం జరిపిన కామాంధుడి దారుణ ఉదంతం....
వడోదర(గుజరాత్): ఇంటికి పిలిచి చాక్లెట్లు, మిఠాయిలు ఇచ్చి ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం జరిపిన కామాంధుడి దారుణ ఉదంతం గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో వెలుగుచూసింది. వడోదర నగరంలోని మకరపురా ప్రాంతానికి చెందిన రజనీకాంత్ మహతో అనే వ్యక్తి మైనర్ బాలికలకు చాక్లెట్లు, మిఠాయిలు ఇచ్చి గదిలోకి తీసుకువెళ్లి వారిపై అత్యాచారం జరిపాడు. ఇలా రజనీకాంత్ మహతో ముగ్గురు బాలికలపై అత్యాచారం చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై ఉపాధ్యాయురాలు చెప్పడంతో తరగతి గదిలోని ఓ బాలిక రోదించింది. తాను అత్యాచారానికి గురైనట్లు గుర్తించింది.
ముగ్గురు బాలికలపై తాను అత్యాచారం చేశానని అంగీకరించడంతో రజనీకాంత్ మహతోను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర బాలికలపై కూడా నిందితుడు అత్యాచారం చేశాడా అనే విషయంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.