గుజరాత్ లో కరోనాతో 14 నెలల పసికందు మృతి

ABN , First Publish Date - 2020-04-08T10:53:08+05:30 IST

కరోనా వైరస్ దేశంలో వినాశనాన్ని సృష్టిస్తోంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కరోనాతో 14 నెలల చిన్నారి మరణించింది. ఈ చిన్నారికి...

గుజరాత్ లో  కరోనాతో  14 నెలల పసికందు మృతి

జామ్‌నగర్‌: కరోనా వైరస్ దేశంలో వినాశనాన్ని సృష్టిస్తోంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కరోనాతో 14 నెలల చిన్నారి మరణించింది. ఈ చిన్నారికి ఆదివారం కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారితమవగా, మంగళవారం కన్నుమూసింది. గుజరాత్‌లో కరోనా వైరస్ కారణంగా నాల్గవ మరణం సంభవించింది. అంతకుముందు గుజరాత్‌లో సూరత్, పటాన్‌లలో ఒక్కొక్కరు మరణించారు. పెరుగుతున్న కరోనా వైరస్ బీభత్సం మధ్య కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. అయినప్పటికీ, కరోనా కేసుల సంఖ్య  తగ్గడం లేదు. దేశంలో కరోనా రోగుల సంఖ్య 4784 గా  ఉంది. అదే సమయంలో మరణాల సంఖ్య 124 కు చేరుకుంది. అయితే కరోనా నుండి  కోలుకుని 325 మంది డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో 1000 మందికి పైగా కరోనా సోకగా, 64 మంది మరణించారు. దేశంలో గత 24 గంటల్లో 508 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 


Updated Date - 2020-04-08T10:53:08+05:30 IST