గుజరాత్‌ గెలుపు

ABN , First Publish Date - 2022-01-21T08:54:30+05:30 IST

హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ విజయం సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో

గుజరాత్‌ గెలుపు

బెంగళూరు: హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ విజయం సాధించింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 37-35తో తమిళ్‌ తలైవాస్‌పై గెలిచింది. గుజరాత్‌ రైడర్‌ మహేంద్ర రాజ్‌పుత్‌ 9 పాయింట్లు సాధించాడు. తలైవాస్‌ తరఫున మంజీత్‌ సూపర్‌-10తో పోరాడినా జట్టును గెలిపించలేక పోయాడు. మరో మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 40-39తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. బెంగాల్‌ స్టార్‌ రైడర్‌ మణీందర్‌ సింగ్‌ 9 పాయింట్లు సాధించాడు.  

Updated Date - 2022-01-21T08:54:30+05:30 IST