గాంధీనగర్: గుజరాత్లో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల సమయంలో కొద్ది క్షణాల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5గా నమోదైంది. ద్వారకకు ఉత్తర వాయువ్య దిశగా 223 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.