గుజరాత్ అభివృద్ధి యాత్ర కొనసాగిస్తా: భూపేంద్ర పటేల్
ABN , First Publish Date - 2021-09-13T00:46:26+05:30 IST
గుజరాత్ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్తానని ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన ...
గాంధీనగర్: గుజరాత్ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్తానని ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన భూపేంద్ర పటేల్ అన్నారు. తనపై విశ్వాసం ఉంచిన ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విజయ్ రూపానీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొత్త ముఖ్యమత్రిగా పార్టీ నామినేట్ చేసిన అనంతరం తొలిసారి మీడియాతో ఆయన మాట్లాడుతూ, తనపై విశ్వాసముంచి కీలక బాధ్యత అప్పగించిన ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్షా, సీఆర్ పాటిల్, విజయ్ రూపానీ టీమ్కు కృతజ్ఞతలని అన్నారు. తనపై పార్టీ ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయననని, రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగిస్తామని, అందర్నీ కలుపుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. భూపేంద్ర పటేల్ ఘాట్లోడియా నియోజకవర్గం నుంచి 2017లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1,17,000 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్ను ఓడించారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్న ఆనంది బెన్ పాటిల్ ఇదే ఘట్లోడియా నియోజకవర్గం నుంచి 2012లో గెలుపొందారు. ఆనంది బెన్ పటేల్ సన్నిహితుడిగా కూడా భూపేంద్ర పటేల్కు పేరుంది. కాగా, గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ సోమవారంనాడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.