పారిశ్రామిక ప్రోత్సాహకాలపై మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2021-02-26T09:00:07+05:30 IST

ఇప్పటికే ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం 2020-23 ప్రోత్సాహకాల అమలుకు సంబంధించి పరిశ్రమల శాఖ గురువారం మార్గదర్శకాలు విడుదల చేసింది...

పారిశ్రామిక ప్రోత్సాహకాలపై మార్గదర్శకాలు

అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ఇప్పటికే ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం 2020-23 ప్రోత్సాహకాల అమలుకు సంబంధించి పరిశ్రమల శాఖ గురువారం మార్గదర్శకాలు విడుదల చేసింది. అలాగే, వైఎస్సార్‌ జగనన్న బడుగుల వికాసం పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ప్రకటించిన రాయితీలు పొందేందుకు అవసరమైన ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌ను కూడా ప్రకటించింది. మరోవైపు వివిధ శాఖలకు అవసరమైన వస్తువుల సేకరణకు సంబంధించిన సేకరణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వ మేక్‌ ఇన్‌ ఇండియా పాలసీకి అనుగుణంగా మారుస్తూ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


Updated Date - 2021-02-26T09:00:07+05:30 IST