ఉరివేసుకుని గుడివాడ ఎస్ఐ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-20T08:53:45+05:30 IST
కృష్ణాజిల్లా గుడివాడ టూటౌన్ పోలీసు స్టేషన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన పిల్లి
గుడివాడ(రాజేంద్రనగర్), జనవరి 19: కృష్ణాజిల్లా గుడివాడ టూటౌన్ పోలీసు స్టేషన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన పిల్లి విజయ్కుమార్ గుడివాడ టూటౌన్ ఎస్ఐగా కొద్దినెలల కిత్రం బాధ్యతలు చేపట్టారు. స్టేషన్కు సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. అయనకు 2020 నవంబరులో వివాహమైంది. సోమవారం అర్ధరాత్రి దాటాక అపార్ట్ మెంట్లో విజయకుమార్ ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించాడని ఆయనతో పాటు ఇంట్లో ఉన్న సురేఖ అనే మహిళ అపార్టుమెంటులోని వారికి తెలిపిందని, వారు 108 ఆంబులెన్స్ ద్వారా ఏరియా ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. అప్పటికే విజయ్ కుమార్ మరణించారని వైద్యులు ధ్రువీకరించారన్నారు. విజయ్కుమార్ సోదరుడు విక్రమ్ ఫిర్యాదు మేర కు టూటౌన్ సీఐ వి.దుర్గారావు కేసు నమోదు చేసి మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కాగా, విజయ్కుమార్ బ్యూటీషియన్ సురేఖ అనే మహిళ వేధింపుల వల్లే చనిపోయాడని ఆయన సోదరుడు విక్రమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.