విశాఖపై విషం చిమ్ముతున్నారు: గుడివాడ అమర్నాథ్‌

ABN , First Publish Date - 2022-04-26T01:36:16+05:30 IST

విశాఖపై కొందరు విషం చిమ్ముతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు.

విశాఖపై విషం చిమ్ముతున్నారు: గుడివాడ అమర్నాథ్‌

విశాఖపట్నం: విశాఖపై కొందరు విషం చిమ్ముతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖను పాలన రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తట్టెడు మట్టి కూడా వేయకుండా కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని చెప్పారు.విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను ఎంత దెబ్బతీయాలని చూసినా.. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు.దత్తపుత్రుడి మాటలకు భయపడేది లేదని గుడివాడ అమర్నాథ్‌ హెచ్చరించారు. 

Updated Date - 2022-04-26T01:36:16+05:30 IST