ఇకపై ఎస్ఎంఎస్ ద్వారా కూడా జీఎస్టీ రిటర్న్స్ దాఖలు...

ABN , First Publish Date - 2020-10-29T02:10:41+05:30 IST

గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(జీఎస్టీ) చెల్లింపుదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. ఇకపై కంపోజిట్ పన్ను చెల్లింపుదారులు తమ జీఎస్టీ రిటర్న్స్ ను ఎస్ఎంఎస్ ద్వారా కూడా దాఖలు చేయొచ్చు.

ఇకపై ఎస్ఎంఎస్ ద్వారా కూడా జీఎస్టీ రిటర్న్స్ దాఖలు...

న్యూఢిల్లీ : గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(జీఎస్టీ) చెల్లింపుదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. ఇకపై కంపోజిట్ పన్ను చెల్లింపుదారులు తమ జీఎస్టీ రిటర్న్స్ ను ఎస్ఎంఎస్ ద్వారా కూడా దాఖలు చేయొచ్చు.


కాగా... ఈ సేవలను పొందాలంటే పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ ఫారంలోని సీఎంపీ-08 ద్వారా నిల్ స్టేట్‌మెంట్‌ను దాఖలు చేయొచ్చు. సీఎంపీ-08 ను కంపోజీషన్ టాక్స్ పేయర్స్ చేయాల్సిన స్వీయ అంచనా పన్ను యొక్క త్రైవార్షిక స్టేట్మెంట్ గా పరిగణించవచ్చు.


ఈ కొత్త విధానంతో పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ రిటర్న్ ను ఫైల్ చేయడానికి ఇకపై జీఎస్టీ పోర్టల్ కు లాగిన్ అవ్వాల్సిన పని లేదు. వారు ఎస్ఎమ్ఎస్ ద్వారా కూడా రిటర్న్లను  దాఖలు చేయొచ్చు. అయితే పన్ను ప్రయోజనాలను పొందాలంటే మాత్రం నిర్దేశిత ఫార్మాట్లోనే ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. 

Updated Date - 2020-10-29T02:10:41+05:30 IST