జీఎ్సటీ కౌన్సిల్ సమావేశం వాయిదా!
ABN , First Publish Date - 2020-09-12T06:25:06+05:30 IST
జీఎ్సటీ కౌన్సిల్ సమావేశం వచ్చే నెల 5వ తేదీకి వాయిదా పడినట్లు ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ: జీఎ్సటీ కౌన్సిల్ సమావేశం వచ్చే నెల 5వ తేదీకి వాయిదా పడినట్లు ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఈ సమావేశం ఈనెల 19న జరగాల్సి ఉంది. పార్లమెంట్ సమావేశాల కారణంగా 42వ జీఎ్సటీ కౌన్సిల్ భేటీని వాయిదా వేయాల్సి వస్తోందని పేర్కొన్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ సమావేశాన్ని అక్టోబరు 5న నిర్వహించే అవకాశం ఉందని, తెలిపాయి.