జీఎస్టీ వసూళ్లు తగ్గాయ్... సెప్టెంబర్ దాకా ఫైలింగ్

ABN , First Publish Date - 2020-08-02T23:20:43+05:30 IST

జూలై నెలలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు తగ్గాయి. కరోతోపాటు వివిధ కారణాలు, పరిస్థితుల నేపధ్యంలో ఈ తగ్గుదల నమోదైంది. జూలై నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 87,422 కోట్లుగా నమోదయినట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే.

జీఎస్టీ వసూళ్లు తగ్గాయ్... సెప్టెంబర్ దాకా ఫైలింగ్

న్యూఢిల్లీ : జూలై నెలలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు తగ్గాయి. కరోనాతోపాటు వివిధ కారణాలు, పరిస్థితుల నేపధ్యంలో ఈ తగ్గుదల నమోదైంది. జూలై నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 87,422 కోట్లుగా నమోదయినట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే.


ఇందులో సీజీఎస్టీ రూ. 16,147 కోట్లు, ఎస్జీఎస్టీ రూ. 21,418 కోట్లు, ఐజీఎస్టీ రూ. 42,592 కోట్లు ఉన్నాయి. ఇందులో గూడ్స్ ఇంపోర్ట్స్ ద్వారా రూ. 20,324 కోట్లు వచ్చాయి. సెస్ ద్వారా రూ. 7,265 కోట్లు రాగా, ఇందులో రూ. 807 కోట్లు గూడ్స్ ఇంపోర్ట్స్ ద్వారా వచ్చాయి. కాగా... జీఎస్టీ రిటర్న్‌ల ఫైలింగ్‌కు సెప్టెంబరు వరకు గడువుంది. 


Updated Date - 2020-08-02T23:20:43+05:30 IST