కోళ్ల పెంపకంతో ఆర్థికంగా ఎదగాలి

ABN , First Publish Date - 2022-08-20T03:52:20+05:30 IST

కోళ్ల పెంపకంతో ఆర్థికంగా ఎదగాలని ఐటీడీఏ పీవో వరుణ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని లొద్దిగూడ గ్రామపరిధిలో కోలాంగూడ, రాఘాపూర్‌ గ్రామాలను ఆయన సందర్శిం చి 25మందికి కోడిపిల్లలను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆది వాసీకులం గిరిజనులు కోళ్ల పెంపకంను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాల న్నారు.

కోళ్ల పెంపకంతో ఆర్థికంగా ఎదగాలి
కోళ్లను పంపిణీ చేస్తున్న ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి

- ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి

లింగాపూర్‌, ఆగస్టు 19: కోళ్ల పెంపకంతో ఆర్థికంగా ఎదగాలని ఐటీడీఏ పీవో వరుణ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని లొద్దిగూడ గ్రామపరిధిలో కోలాంగూడ, రాఘాపూర్‌ గ్రామాలను ఆయన సందర్శిం చి 25మందికి కోడిపిల్లలను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆది వాసీకులం గిరిజనులు కోళ్ల పెంపకంను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాల న్నారు. కోలాం గిరిజన జీవనస్థితులలో మార్పులు రావాలని కోరారు. అనంతరం జాముల్‌ధర నుంచి చీమనేతండా వరకు భారీ వర్షా లతో చెడిపోయిన రోడ్డును మరమ్మతులు చేపిస్తా మని హామీ ఇచ్చారు. మోడిగూడలో తల్లిదం డ్రులు చనిపోయి అనాథలుగా మిగిలిన ముగ్గురు పిల్లలను పరామర్శించి ఐటీడీఏ ద్వారా ఆదుకుంటామని అన్నారు. ఐటీడీఏ ఏపీవో భాస్కర్‌, ఎంపీడీవో ప్రసాద్‌, సర్పంచ్‌ అనురాధ, ఎంపీవో ఉమర్‌షరీఫ్‌, కార్యదర్శి సాగర్‌ ఉన్నారు.

Updated Date - 2022-08-20T03:52:20+05:30 IST