గ్రూపుదేవాలయాల పాలకమండలి చైర్మన్గా నారాయణరెడ్డి
ABN , First Publish Date - 2021-07-26T06:01:09+05:30 IST
లాలాపేట గ్రూపు దేవాలయాల పరిధిలోని వెంకటేశ్వరస్వామి, జగన్నాథస్వామి, ఆంజనేయస్వామి దేవస్థానాలకు నూతన పాలకమండలి ఆదివారం కొలువుతీరింది.
గుంటూరు (కార్పొరేషన్), జూలై 25: లాలాపేట గ్రూపు దేవాలయాల పరిధిలోని వెంకటేశ్వరస్వామి, జగన్నాథస్వామి, ఆంజనేయస్వామి దేవస్థానాలకు నూతన పాలకమండలి ఆదివారం కొలువుతీరింది. పాలకమండలి చైర్మన్గా పి. జయప్రకాష్నారాయణరెడ్డిని పాలకవర్గసభ్యులు ఎన్నుకున్నారు. సభ్యులుగా కండె విశాలాక్షి, వెంకటజ్యోతి, గోరంట్ల నరేష్కుమార్, గంజి రామకోటేశ్వరరావు, పధ్మనాభుని వీరవెంకట రత్నం, చూరబోయిన శ్రీనివాసులు, ఐలా అనిత, జగన్నాధ శివకుమారిలతోపాటు ఎక్స్ అపీషియో మెంబర్గా ప్రసాద్ను ఎన్నుకున్నారు. పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆలయ సహాయ కమిషనర్ డి.శ్రీనివాసరావు నిర్వహించారు. తొలుత సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం పాలక మండలి చైర్మన్గా జయప్రకాష్ నారాయణరెడ్డిని లాంఛనంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్ కావటి శివనాగమనోహర్ నాయుడు, ఎమ్మెల్యే ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.