పాలేరులో ఎమ్మెల్యే వర్సెస్ టీఆర్ఎస్ కార్యకర్తలు

ABN , First Publish Date - 2021-08-02T23:12:16+05:30 IST

పాలేరులో ఎమ్మెల్యే వర్సెస్ టీఆర్ఎస్ కార్యకర్తలు

పాలేరులో ఎమ్మెల్యే వర్సెస్ టీఆర్ఎస్ కార్యకర్తలు

ఖమ్మం: పాలేరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తమను టార్గెట్ చేసి వేధిస్తున్నారని, అక్రమ కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు ఖమ్మం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు తమపై కేసు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసుల వ్యవహారంపై పాలేరు టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కందాల ఉపేందర్ రెడ్డి వల్లే విబేధాలు వస్తున్నాయని అంటున్నారు. రేవంత్ రెడ్డికి ఉపేందర్ రెడ్డి దగ్గర బంధువు అని, దానివల్ల స్థానిక టీఆర్ఎస్ నేతలను దూరం పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. 




Updated Date - 2021-08-02T23:12:16+05:30 IST