పెళ్లి పీటలపై వధువు.. మండపానికి 3గంటలు ఆలస్యంగా వరుడు.. అతడు చెప్పింది విని..

ABN , First Publish Date - 2022-02-28T01:34:54+05:30 IST

యువతి, యువకుడు ఒకరికొకరు నచ్చడంతో వారిద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అనుకున్న సమయానికి వధువు కుటుంబ సభ్యులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. ముహూర్తానికి వధువు పె

పెళ్లి పీటలపై వధువు.. మండపానికి 3గంటలు ఆలస్యంగా వరుడు.. అతడు చెప్పింది విని..

ఇంటర్నెట్ డెస్క్: యువతి, యువకుడు ఒకరికొకరు నచ్చడంతో వారిద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. అనుకున్న సమయానికి వధువు కుటుంబ సభ్యులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. ముహూర్తానికి వధువు పెళ్లి పీటలపై కూర్చుంది. కానీ వరుడు మాత్రం 3 గంటలు ఆలస్యంగా మండపానికి చేరుకున్నాడు. కాస్త ఆలస్యం అయినా వధువు మెడలో తాళికట్టి ఆలిని చేసుకున్నాడు. అనంతరం మండపానికి తాను ఆలస్యంగా రావడానికి గల కారణాన్ని వివరించాడు. అతడు ఇచ్చిన వివరణ ఏంటనే వివరాల్లోకి వెళితే..



మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్‌కు చెందిన ప్రీతీసెన్, రామ్‌జీ సెన్‌ ఇద్దరూ ఒకరికొకరు నచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు వీరిద్దరీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా వివాహ వేడుకను ఏర్పాటు చేసేందుకు సాహసించలేదు. సామూహిక వివాహాల్లో భాగంగా ఇద్దరికీ పెళ్లి చేయాలని భావించారు. ఈ క్రమంలోనే వధువు సహా ఇరు కుటుంబ సభ్యులు శనివారం ఉదయం మండపానికి చేరుకున్నారు. కానీ వరుడు మాత్రం వివాహ వేదిక వద్దకు రాలేదు. అయితే ముహూర్తం సమీపించడంతో వధువు పెళ్లి పీటలపై కూర్చొని వరుడి కోసం ఎదురు చూసింది. ఈ నేపథ్యంలో వరుడు సుమారు 3గంటల ఆలస్యంగా అక్కడకు చేరుకుని.. వధువు మెడలో తాళికట్టాడు. అనంతరం ఆలస్యంగా రావడానికి గల కారణాన్ని వివరించాడు. తనకు ప్రస్తుతం 21 ఏళ్లైనా.. తన వద్ద 10వ తరగతి సర్టిఫికెట్ లేదన్నారు. అందువల్లే కొన్ని రోజులుగా 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధం అవుతున్నట్టు చెప్పాడు. పెళ్లి రోజునే పరీక్ష ఉండటంతో ఎగ్జామ్ రాసేందుకు వెళ్లినట్టు చెప్పాడు. అతడు చెప్పింది విని స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. 



Updated Date - 2022-02-28T01:34:54+05:30 IST