పోలీసుల సమక్షంలో ఊరందరి మధ్య ప్రేయసితో ఆ యువకుడికి పెళ్లి.. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-07-16T02:35:46+05:30 IST

బీహార్‌లోని జాముయ్ జిల్లాలో బుధవారం రాత్రి ఓ విచిత్ర వివాహం జరిగింది. నైట్‌డ్రెస్ ధరించి ఉన్న వరుడు వధువు మెడలో వరమాల వేశా

పోలీసుల సమక్షంలో ఊరందరి మధ్య ప్రేయసితో ఆ యువకుడికి పెళ్లి.. ఇంతకీ ఆ రాత్రి ఏం జరిగిందంటే..

బీహార్‌లోని జాముయ్ జిల్లాలో బుధవారం రాత్రి ఓ విచిత్ర వివాహం జరిగింది. నైట్‌డ్రెస్ ధరించి ఉన్న వరుడు వధువు మెడలో వరమాల వేశాడు. పోలీసులు, గ్రామస్తులు టార్చ్ లైట్లు పట్టుకోగా ఆ వెలుగులో వధువు మెడలో తాళి కట్టాడు. ఈ వివాహం ఆ జిల్లాలో చర్చనీయాంశగా మారింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు యువతితో యువకుడు నిరంజన్ చాలా ఏళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. వీరిద్దరూ గుజరాత్‌లోని సూరత్‌లో సహజీవనం చేశారు. 


ఇది కూడా చదవండి..

అతడికి 45 ఏళ్లు.. ఆమెకు 44 ఏళ్లు.. ఊరి చివర పొలాల్లో నిర్జీవంగా.. పక్కనే తుపాకీ.. అసలేం జరిగిందంటే..


పెళ్లి చేసుకుంటానని మాటివ్వడంతో నిరంజన్‌కు ఆ యువతి శారీరకంగా కూడా దగ్గరైంది. కొన్ని వారాల క్రితం నిరంజన్ జాముయిలోని తన స్వగ్రామానికి  వెళ్లాడు. అప్పట్నుంచి ఆ యువతికి పూర్తిగా దూరమయ్యాడు. ఆమె ఎన్ని ఫోన్లు చేసినా స్పందించేవాడు కాదు. కుటుంబ సభ్యుల సమక్షంలో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు నిరంజన్ సిద్ధమయ్యాడు. ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అతడి మాజీ ప్రేయసి తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే ఆ గ్రామానికి చేరుకుంది. 


రెండు కుటుంబీకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో విషయం పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు ఇరు కుటుంబాల వారితో మాట్లాడారు. నిరంజన్‌ ఆ అమ్మాయిని మోసం చేసి వేరే అమ్మాయితో వివాహానికి సిద్ధపడినట్టు తెలుసుకున్నారు. పోలీసులు, గ్రామస్తుల నుంచి ఒత్తిడి పెరగడంతో నిరంజన్‌.. బుధవారం రాత్రి తన ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. నైట్‌డ్రెస్‌లో ఉండగానే హడావుడిగా టార్చ్‌లైట్ల వెలుగులో పెళ్లి చేసుకున్నాడు. 

Updated Date - 2022-07-16T02:35:46+05:30 IST