పెళ్లైన మరుసటి రోజే షాకిచ్చిన వధువు.. 13రోజుల తర్వాత వరుడు అనూహ్య నిర్ణయం!

ABN , First Publish Date - 2022-04-22T23:36:07+05:30 IST

కుమారుడికి పెళ్లీడు రావడంతో తల్లిదండ్రులు సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఓ అమ్మాయిని చూసి ముచ్చటపడ్డారు. ఆమె తమ ఇంటి కోడలైతే బాగుంటుందని భావించారు. అబ్బాయికి కూడా ఆ అమ్మాయి నచ్చ

పెళ్లైన మరుసటి రోజే షాకిచ్చిన వధువు.. 13రోజుల తర్వాత వరుడు అనూహ్య నిర్ణయం!

ఇంటర్నెట్ డెస్క్: కుమారుడికి పెళ్లీడు రావడంతో తల్లిదండ్రులు సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఓ అమ్మాయిని చూసి ముచ్చటపడ్డారు. ఆమె తమ ఇంటి కోడలైతే బాగుంటుందని భావించారు. అబ్బాయికి కూడా ఆ అమ్మాయి నచ్చడంతో ఎదురు కట్నం ఇచ్చి మరీ ఆమెను కోడులుగా తెచ్చుకున్నారు. అయితే పెళ్లైన మరుసటి రోజే ఆ యువతి వరుడు సహా అందరికీ షాకిచ్చింది. ఈ క్రమంలో తాజాగా వరుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



రాజస్థాన్‌లోని సికార్ ప్రాంతానికి చెందిన శోభన్ అనే యువకుడికి హిజార్ ప్రాంతానికి చెందిన యువతితో ఏప్రిల్ 9న వివాహం జరిగింది. అయితే పెళ్లైన మరుసటి రోజే అంటే ఏప్రిల్ 10న ఆ నవవధువు అందరికీ షాకిచ్చింది. ఇంట్లోంచి పారిపోయింది. దీంతో గురువారం సాయంత్రం శోభన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా శోభన్ తండ్రి నవవధువుపై ఫిర్యాదు చేశాడు. ఉషా శర్మ, అశోక్ అనే పెళ్లిళ్ల బ్రోకర్ల ద్వారా ఆమె తమకు పరిచయం అయిందని చెప్పారు. పెళ్లి కోసం రెండు లక్షలు కూడా ఇచ్చినట్టు వెల్లడించారు. అయితే వివాహం అయిన మరుసటి రోజే వధువు ఇంట్లోంచి వెళ్లిపోవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురై తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్టు పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 


Updated Date - 2022-04-22T23:36:07+05:30 IST