Tamilisai Soundar Rajan: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు: తమిళి సై

ABN , First Publish Date - 2022-07-25T17:59:19+05:30 IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శుభాకాంక్షలు తెలిపారు.

Tamilisai Soundar Rajan: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు: తమిళి సై

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu)కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ (Tamilisai Soundar Rajan) శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ప్రమాణస్వీకారోత్సవానికి గవర్నర్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. చాలా కింది స్థాయి నుంచి వచ్చారని... చాలా సింపుల్ పర్సన్ అని..ఇది మహిళలకు దక్కిన గౌరవంగా చెప్పుకొచ్చారు. మహిళలకు ఒక రోల్ మోడల్ ద్రౌపది ముర్ము అని తెలిపారు.


రాజకీయాలు మాట్లాడను...

కాగా... గవర్నర్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య గ్యాప్‌పై స్పందించేందుకు గవర్నర్ నిరాకరించారు. ‘‘నన్ను రాష్టప్రతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి పిలిచారు వచ్చాను. నేను రాజకీయాలు మాట్లాడాను’’ అంటూ గవర్నర్ తమిళిసై మీడియాకు తెలిపారు. 


భద్రాచలం ఏరియాలో పర్యటనపై గవర్నర్ ఏమన్నారంటే...

వర్షాలు వచ్చాయి కాబట్టి వరద ప్రాంతాల్లో తిరిగానని గవర్నర్ అన్నారు. ‘‘నేను రాష్ట్రానికి ప్రథమ పౌరాలను కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళాను. వర్షాలలో ఎక్కువగా నష్టపోయిన ప్రాంతాలు ఆదివాసీలో ఉన్న ప్రాంతాలు కాబట్టి భద్రాచలం ఏరియాలో తిరిగాను. మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి నేను ప్రజల  దగ్గరకు వెళ్ళాను. నేను తెలుగు  ప్రజల కోసం పనిచేస్తున్నా. వర్షాలపై రిపోర్టుని కేంద్రం హోంశాఖ మంత్రి ఇచ్చాను... వాళ్లు కేంద్ర బృందాలను పంపించారు. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా రాష్ట్రానికి సహాయం చేస్తుంది.. గతంలో వరదలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్షాల వల్ల ఎంత నష్టం జరిగిందో కేంద్రానికి ఇచ్చారు. 

Updated Date - 2022-07-25T17:59:19+05:30 IST