హరిత తెలంగాణకు కృషి చేయాలి
ABN , First Publish Date - 2020-07-06T10:45:46+05:30 IST
హరిత తెలంగాణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతసురేష్ అన్నారు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్,జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్
జగిత్యాల రూరల్, జూలై 05 : హరిత తెలంగాణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజ య్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతసురేష్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలంలోని చ ల్గల్ గ్రామంలో 6వ హరితహారం కార్యక్రమంలో భా గంగా చైర్ పర్సన్దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మొక్కలు నాటారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా ఎవరికి వారే తీ సుకోవాలన్నారు. రాబోవు తరాలను మనం నాటే మొ క్కలు ఎంతో లాభాన్ని చేకూరుస్తాయన్నారు. చైర్పర్సన్ వసంత మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల భవి ష్యత్తులో సమృద్ధిగా వర్షాలు పడతాయని, వాటి ద్వారా పంటలు బాగా పండుతాయన్నారు. అనంతరం రైతు వేది క నిర్మాణానికి స్థలాన్ని పరీశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగారాంగౌడ్, ఏఎంసీ చైర్మన్ దామోదర్రావు, స ర్పంచ్ గంగనర్సు పాల్గొన్నారు.