గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ స్వీకరించిన ఎస్పీ

ABN , First Publish Date - 2022-08-20T03:51:03+05:30 IST

ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ఇండియాచాలెంజ్‌ స్వీకరించిన ఆదిలా బాద్‌ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి మొక్కలునాటి, ఆసిఫా బాద్‌ జిల్లాఎస్పీతోపాటు మరో ఇద్దరు అధికారులకు చాలెంజ్‌ ఇచ్చారు.

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ స్వీకరించిన ఎస్పీ
మొక్క నాటుతున్న ఎస్పీ సురేష్‌కుమార్‌

ఆసిఫాబాద్‌, ఆగస్టు 19: ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ఇండియాచాలెంజ్‌ స్వీకరించిన ఆదిలా బాద్‌ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి మొక్కలునాటి, ఆసిఫా బాద్‌ జిల్లాఎస్పీతోపాటు మరో ఇద్దరు అధికారులకు చాలెంజ్‌ ఇచ్చారు. దీంతో చాలెంజ్‌ స్వీకరించిన ఎస్పీ సురేష్‌కుమార్‌ శుక్రవారం నిర్మాణంలో ఉన్న నూతన జిల్లాపోలీసు కార్యాలయంలో మొక్కలు నాటారు. జిల్లాలో ఇప్పటివరకు 3000పైగామొక్కలు నాటామని ఎస్పీ పేర్కొన్నారు. ఈచాలెంజ్‌లో భాగంగా ఆసిఫా బాద్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డికి గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో మొక్కలునాటి భాగస్వాములు కావాలని చాలెంజ్‌ చేశారు. ఏఎస్పీలు అచ్చేశ్వర్‌రావు,  భీంరావు, డీఎస్పీ శ్రీనివాస్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T03:51:03+05:30 IST