జీసీసీ జోన్ల సంఖ్య 22కు పెంపు
ABN , First Publish Date - 2022-04-09T14:25:53+05:30 IST
నిర్వహణా సౌలభ్యం కోసం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ)లో ప్రస్తుతమున్న 15 జోన్లను 22కు విస్తరించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనున్నట్లు రాష్ట్ర
- త్వరలో చర్యలు
ప్యారీస్(చెన్నై): నిర్వహణా సౌలభ్యం కోసం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ)లో ప్రస్తుతమున్న 15 జోన్లను 22కు విస్తరించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనున్నట్లు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ ప్రకటించారు. ఆయన శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో 2011వ సంవత్సరంలో పది జోన్లు, 155 వార్డులతో ఉన్న జీసీసీని విస్తరింపజేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు. కొన్ని శివారు ప్రాంతాలు కలుపుకొని 15 జోన్లు, 200 వార్డులుగా అభివృద్ధి చెందిందని, రోజురోజుకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని నిర్వాహణ సౌలభ్యం కోసం జోన పెంపుపై పరిశీలన జరుపుతున్నట్లు తెలిపారు. జోన్ల సంఖ్యకు తగ్గట్టుగా మెట్రోవాటర్ బోర్డు కార్యాలయాలు, పన్నుల వసూలు కేంద్రాల సంఖ్య కూడా పెంచనున్నట్లు మంత్రి వివరించారు.