ఫ్రీడం రన్కు విశేష స్పందన
ABN , First Publish Date - 2022-08-12T04:59:22+05:30 IST
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లాలో
రంగారెడ్డి అర్బన్, ఆగస్టు 11 : స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లాలో గురువారం నిర్వహించిన ఫ్రీడం రన్కు విశేష స్పందన లభించింది. సరూర్నగర్లోని ఇండోర్స్టేడియంలో మంత్రి సబితారెడ్డి జాతీయజెండా చేతపట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి గురునానక్ కళాశాల నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఫ్రీడం రన్లో పాల్గొన్నారు. అలాగే చేవెళ్లలో ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల బస్టేషన్ నుంచి షాబాద్ ఎక్స్రోడ్డు వరకు ఫ్రీడం రన్లో పాల్గొన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో సీఐఎ్సఎఫ్ సిబ్బంది జెండాలు చేత పట్టుకుని బైక్ ర్యాలీ నిర్వహించారు. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్నగర్ రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు నిర్వహించి ఫ్రీడం రన్లో పాల్గొన్నారు.