బూడిదైన జీవనాధారం

ABN , First Publish Date - 2021-03-02T05:46:52+05:30 IST

ఓ వృద్ధ దంపతుల జీవనా ధారమైన టీ దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టి, బూడిద చేశారు. ఈ సంఘటన సిరిపురం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

బూడిదైన జీవనాధారం
కాలిబూడిదైన టీ దుకాణం

  టీ దుకాణానికి  నిప్పుపెట్టిన దుండగులు

గంట్యాడ: ఓ వృద్ధ దంపతుల జీవనా ధారమైన టీ దుకాణానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టి, బూడిద చేశారు. ఈ సంఘటన సిరిపురం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దామిశెట్టి అప్పలస్వామి, కృష్ణమ్మ అనే వృద్ధ దంపతు లు గ్రామంలోని ప్రధాన వీధిలో టీ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.  ఆదివారం ఉదయం తమ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లారు. అయితే అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు టీ దుకాణానికి నిప్పుపెట్టి పరారయ్యారు. వెంటనే సమాచారం తెలుసుకున్న దంపతులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో వంట సామగ్రితో పాటు మెటీరియల్‌ కూడా పూర్తిగా కాలి బూడిద య్యింది. ఇప్పుడు తమ జీవనం ఎలా సాగించేది అంటూ ఆ దంపతులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. 

 

 

Updated Date - 2021-03-02T05:46:52+05:30 IST