గ్రావెల్ ట్రిప్పర్ల రాకపోకలపై నిరసన
ABN , First Publish Date - 2021-03-01T05:19:18+05:30 IST
బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని పెద్దూరు - బెస్తపాళెంలో గ్రావెల్ ట్రిప్పర్లను రెండో రోజు ఆదివారం మరోసారి ప్రజలు అడ్డుకున్నారు.
బెస్తపాళెం గ్రామస్థులకు జనసేన మద్దతు
బుచ్చిరెడ్డిపాళెం, ఫిబ్రవరి 28: బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని పెద్దూరు - బెస్తపాళెంలో గ్రావెల్ ట్రిప్పర్లను రెండో రోజు ఆదివారం మరోసారి ప్రజలు అడ్డుకున్నారు. వీరికి కోవూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మద్దతిస్తూ గ్రావెల్ లోడుతో రాకపోకలు సాగించే ట్రిప్పర్లను అడుకుని హెచ్చరించారు. ట్రిప్పర్ల రాకపోకలతో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా చూసి ట్రిప్పర్లను అడ్డుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ నిరసనలో స్థానిక ప్రజలు, జనసేన నాయకులు డాక్టర్ కత్తి తిరుమల, శ్రీను, లోకేష్, రూపేష్, మున్వర్ బాషా, పవన్, సురేష్, నవీన్, నాగార్జున, చిన్న, చరణ్, సునీల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.