పంటల బీమా మంజూరు చేయండి

ABN , First Publish Date - 2022-06-27T06:08:40+05:30 IST

పంటల బీమా మంజూరు చేయాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వ ర్యంలో కొత్తకుంకాం పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల రైతులు ఆదివారం ఆందోళన చేశారు.

పంటల బీమా మంజూరు చేయండి
ఆందోళన చేస్తున్న రైతులు, జనసేన కార్యకర్తలు


లావేరు: పంటల బీమా మంజూరు చేయాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వ ర్యంలో కొత్తకుంకాం పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల రైతులు ఆదివారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2021 ఖరీఫ్‌లో మొక్క జొన్న, అరటి పంటలను నష్టపోయినా ప్రభుత్వం బీమాను మంజూరు చేయకపో వడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించపోతే గ్రామ సచివాల యం, మండల వ్యవసాయశాఖ  కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపడతామని జనసేన నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో జనసేన నేతలు వడ్డిపల్లి శ్రీనివాసరావు, భూపతి అర్జున్‌, అదపాక అప్పలరాజు, రైతులు పాల్గొన్నారు.


 


Updated Date - 2022-06-27T06:08:40+05:30 IST