అమ్మాయిలు నచ్చినా పెళ్లి సంబంధాలు రద్దు చేస్తున్న నాయనమ్మ.. సహనం కోల్పోయి ఆ 25 ఏళ్ల యువకుడు ఎంత పనిచేశాడంటే..

ABN , First Publish Date - 2022-05-18T20:13:10+05:30 IST

ఆ యువకుడి వయసు పాతికేళ్లు.. పెళ్లి చేసుకోవాలని సంబంధాలు చూస్తున్నాడు.. ఎంత మంది అమ్మాయిలను చూపిస్తున్నా అతడి నాయనమ్మ తిరస్కరిస్తోంది..

అమ్మాయిలు నచ్చినా పెళ్లి సంబంధాలు రద్దు చేస్తున్న నాయనమ్మ.. సహనం కోల్పోయి ఆ 25 ఏళ్ల యువకుడు ఎంత పనిచేశాడంటే..

ఆ యువకుడి వయసు పాతికేళ్లు.. పెళ్లి చేసుకోవాలని సంబంధాలు చూస్తున్నాడు.. ఎంత మంది అమ్మాయిలను చూపిస్తున్నా అతడి నాయనమ్మ తిరస్కరిస్తోంది.. విసిగిపోయిన యువకుడు నాయనమ్మపై ఆగ్రహం పెంచుకున్నాడు.. తనకు పెళ్లి కాకుండా నాయనమ్మ కుట్ర పన్నుతోందని భావించాడు.. సహనం కోల్పోయి నాయనమ్మ చనిపోయే వరకు కర్రతో కొట్టాడు.. చివరకు కటకటాల పాలయ్యాడు.. మహారాష్ట్రంలోని షోలాపూర్‌లో ఈ ఘటన జరిగింది. 

ఇది కూడా చదవండి..

వీడసలు భర్తేనా.. పెళ్లయి 13 ఏళ్లు అవుతున్నా ఇదేం పాడు బుద్ధి.. స్నేహితులను ఇంటికి పిలిచి మరీ..


షోలాపూర్‌కు సమీపంలోని ఆదర్శ్ నగర్‌లో నివాసముంటున్న మల్నబీ హసన్ అనే వృద్ధురాలు తన మనవడు సలీంకు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూడడం ప్రారంభించింది. మనవడిని బెంగళూరు నుంచి ఇంటికి పిలిపించి అతడితో వెళ్లి పెళ్లి కోసం అమ్మాయిలను చూసేది. అయితే సలీంకు నచ్చిన అమ్మాయిలు నాయనమ్మకు నచ్చేవారు కాదు. దీంతో ఆమె తిరస్కరించేది. మరో అమ్మాయిని చూడ్డానికి రమ్మని పిలిచేది. నాయనమ్మ తీరుతో సలీం విసిగపోయి ఆమెతో గొడవకు దిగేవాడు. తనకు పెళ్లి చేయడం నాయనమ్మకు ఇష్టం లేదని భావించేవాడు. 


పెళ్లి సంబంధాల విషయమై నాయనమ్మతో సోమవారం సాయంత్రం సలీం గొడవకు దిగాడు. చివరకు సహనం కోల్పోయి కర్రతో నాయనమ్మను కొట్టాడు. ఆమె చనిపోయే వరకు కొడుతూనే ఉన్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని సలీంను రిమాండ్‌కు తరలించారు. 


Updated Date - 2022-05-18T20:13:10+05:30 IST