3ఏళ్ల మనవరాలిని చంపిన బామ్మ..ఎలాగైనా పగ తీర్చుకోవాలని..

ABN , First Publish Date - 2021-06-10T21:32:29+05:30 IST

తన విరోధికి ఎలాగైన బుద్ధి చెప్పాలనుకున్న ఓ వృద్ధురాలు తన కుటుంబలోనేు నిప్పులు పోసుకుంది. పట్టరాని పగతో విచక్షణ కోల్పోయిన ఆమె తన శత్రువుపై పగ తీర్చుకునే క్రమంలో మూడేళ్ల వయసున్న తన మనవరాలిని ఆమె బలి తీసుకుంది.

3ఏళ్ల మనవరాలిని చంపిన బామ్మ..ఎలాగైనా పగ తీర్చుకోవాలని..

బరన్(రాజస్థాన్): తన విరోధికి ఎలాగైన బుద్ధి చెప్పాలనుకున్న ఓ వృద్ధురాలు తన కుటుంబలోనే నిప్పులు పోసుకుంది. విచక్షణ కోల్పోయిన ఆమె తన శత్రువుపై పగ తీర్చుకునే క్రమంలో మూడేళ్ల వయసున్న తన మనవరాలిని ఆమె బలి తీసుకుంది. రాజస్థాన్ బరన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. బోరినా గ్రామానికి చెందిన కనకబాయ్, ఆమె కుటుంబసభ్యులకు అదే గ్రామానికి చెందిన రామేశ్వర్ మోగ్యా కుటుంబానికి మధ్య నీళ్ల విషయమై కొన్ని విబేధాలు ఉండేవి. రెండు నెలల క్రితం ఇరు వర్గాల మధ్య ఈ విషయమై పెద్ద గొడవ జరగింది. ఇందులో కనకబాయి మనవరాలితో పాటూ రామేశ్వర్ మోగ్యా కూతురు కూడా గాయపడింది. ఆ తరువాత.. పోలీసు కేసు పెడతానంటూ కనక్ బాయ్ రమేశ్వర్ మోగ్యాను బెదిరించింది. దీంతో..అతడు పారిపోయాడు. ఈ క్రమంలో కనక‌బాయ్ తన మనవరాలిని చంపేసి రమేశ్వర్ మోగ్యాపై ఈ నేరాన్ని నెట్టేసింది. పోలీసు కేసు కూడా పెట్టింది.  అయితే..దర్యాప్తు చేపడుతున్న పోలీసులకు కనకబాయ్ తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో వారు ఆమెను తమదైన శైలిలో ప్రశ్నించగా జరిగిన దారుణం గురించి వెలుగులోకి వచ్చింది. దీంతో..వారు నిందితురాలిని అరెస్టు చేశారు.

Updated Date - 2021-06-10T21:32:29+05:30 IST