ఆరేళ్ల బాలికపై తాత, మేనమామ అత్యాచారం.. ఎవరికీ చెప్పొద్దంటూ రూ.20 చేతికి!

ABN , First Publish Date - 2021-04-11T01:10:06+05:30 IST

మధ్యప్రదేశ్‌లో దారుణాతి దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై ఆమె తాత, మేనమామ కలిసి సామూహిక అత్యాచారానికి

ఆరేళ్ల బాలికపై తాత, మేనమామ అత్యాచారం.. ఎవరికీ చెప్పొద్దంటూ రూ.20 చేతికి!

భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణాతి దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై ఆమె తాత, మేనమామ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ బాలిక చేతిలో  20 రూపాయలు పెట్టి వెళ్లిపోయారు. మరో ఘోరమైన విషయం ఏమిటంటే.. బాలిక తమ్ముడి ఎదుటే వారు అత్యాచారానికి పాల్పడడం. భోపాల్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎనిమిది రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.


సాయంత్రం ఆరు గంటల సమయంలో పని నుంచి ఇంటికొచ్చిన తల్లి కుమార్తె ప్రవర్తనలో మార్పును గమనించింది. పొంతనలేని మాటలు మాట్లాడుతుండడంతో కీడు శంకించింది. దీంతో ఏమైందని ప్రశ్నించింది. అయితే, తల్లి ఎక్కడ తిడుతుందో అని ఆ దారుణ ఘటన గురించి చెప్పడానికి బాలిక భయపడింది. ఆ తర్వాత గద్దించడంతో అసలు విషయం చెప్పింది. షాకైన తల్లి తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


సమోసాలు ఇస్తానంటూ బాలిక మేనమామ బాలికను, ఆమె మూడేళ్ల తమ్ముడిని బంధువుల ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడ అప్పటికే ఆమె తాత ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇద్దరూ కలిసి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. చిన్నారి సోదరుడు కళ్లముందే వారీ దారుణానికి ఒడిగట్టారని చెప్పారు. ఆ తర్వాత బాధిత బాలిక చేతిలో రూ. 20 పెట్టి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దన్నారు. సమోసాలు కొనిచ్చి ఇంటి వద్ద విడిచిపెట్టారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

Updated Date - 2021-04-11T01:10:06+05:30 IST