ఘనంగా రాజరాజనరేంద్రుడి పట్టాభిషేక దినోత్సవం

ABN , First Publish Date - 2022-08-17T07:01:37+05:30 IST

రాజమహేంద్రవరం మహారాజుగా రాజరాజ నరేంద్రుడు పట్టాభిషేకం చేసిన రోజును నగరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా రాజరాజనరేంద్రుడి పట్టాభిషేక దినోత్సవం

రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 16: రాజమహేంద్రవరం మహారాజుగా రాజరాజ నరేంద్రుడు పట్టాభిషేకం చేసిన రోజును నగరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాజరాజ నరేంద్రుడు పట్టాభిషేకం చేసి ఆగస్టు 16 నాటికి సహస్రాబ్ది కాలం పూర్తయిన సంధర్బంగా  రాజమండ్రి సమితి ఆధ్వర్యంలో పుష్కరాలరేవు వెలుపల ఉన్న విగ్రహానికి రంకిరెడ్డి రామ్మోహనరావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు,  మాదిరాజు శ్రీనివాస్‌, పెదిరెడ్ల శ్రీనివాస్‌,  డాక్టర్‌ అరిపిరాల నారాయణరావు పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో  పెరుమాళ్ళ రఘునాథ్‌,   ప్రొఫెసర్‌ డాక్టర్‌ వరప్రసాద్‌, వాకచర్ల కృష్ణ,  దేశిరెడ్డి బలరామనాయుడు, దూర్వాసుల సత్యనారాయణ, అల్లూరి శేషు, రెండుచింతల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-08-17T07:01:37+05:30 IST