వైభవంగా వీరుళ్లమ్మ జాతర

ABN , First Publish Date - 2021-01-16T06:01:59+05:30 IST

అనపర్తిలో ఐదు రోజులపాటు జరిగే గ్రామదేవత వీరుళ్లమ్మ అమ్మవారి జాతర, తీర్థ మహోత్సవాలను ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి గరగను తలకెత్తుకుని ప్రారంభించారు.

వైభవంగా వీరుళ్లమ్మ జాతర

వైభవంగా వీరుళ్లమ్మ జాతర 

 ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి 

అనపర్తి, జనవరి 15: అనపర్తిలో ఐదు రోజులపాటు జరిగే గ్రామదేవత వీరుళ్లమ్మ అమ్మవారి జాతర, తీర్థ మహోత్సవాలను ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి గరగను తలకెత్తుకుని ప్రారంభించారు. గురువారంరాత్రి జరిగిన అమ్మవారి జాతర లో పలు వినోద కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. విద్యుద్ధీపాలంకరణ, హైదరాబాద్‌ వారి ఎగ్జిబిషన్‌ ఆకట్లుకున్నాయి. శుక్రవారం తీర్థ మహోత్సవం సందర్భంగా భక్తులు, పలువురు ప్రముఖులు అమ్మ వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మాస్కులు, సానిటైజర్‌లను ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు సత్తి వెంకటరామారెడ్డి ఏర్పాటుచేశారు. 

సందడి చేసిన జబర్దస్త్‌ టీమ్‌ 

వీరుళ్లమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం సందర్భంగా జబర్దస్థ్‌ టీమ్‌  సభ్యులు అమ్మవారి ఆలయంవద్ద సందడి చేశారు. బుల్లెట్‌ భాస్కర్‌, సునామీ సుధాకర్‌ టీమ్‌ బృందం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరిని చూసేందుకు భక్తులు ఆలయం వద్ద గుమిగూడారు. ఈ సందర్భంగా భాస్కర్‌ మాట్లాడుతూ అమ్మవారి మహిమల గురించి విన్నామని ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ బృందంలో నెమలి రాజు తదితరులున్నారు.



Updated Date - 2021-01-16T06:01:59+05:30 IST