జోయాలుక్కాస్‌ గ్రాండ్‌ రిపబ్లిక్‌ ఆఫర్‌

ABN , First Publish Date - 2021-01-24T07:40:10+05:30 IST

రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా జోయాలుక్కాస్‌ ప్రత్యేకంగా గ్రాండ్‌ రిపబ్లిక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారులకు ప్రతి గ్రాము బంగారం కొనుగోలుపై రూ.72 తగ్గింపుతో పాటు మరికొన్ని ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జోయాలుక్కాస్‌ వెల్లడించింది...

జోయాలుక్కాస్‌ గ్రాండ్‌ రిపబ్లిక్‌ ఆఫర్‌

హైదరాబాద్‌: రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగా జోయాలుక్కాస్‌ ప్రత్యేకంగా గ్రాండ్‌ రిపబ్లిక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారులకు ప్రతి గ్రాము బంగారం కొనుగోలుపై రూ.72 తగ్గింపుతో పాటు మరికొన్ని ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జోయాలుక్కాస్‌ వెల్లడించింది. అలాగే ఆఫర్‌ కాలం లో వినియోగదారులు పాత బంగారు ఆభరణాలను ఎక్స్ఛేం జ్‌ చేసుకోవటమే కాకుండా ఏదేనీ ఆభరణాలతో పాటు సరికొత్త 916 బీఐఎస్‌ బంగారు ఆభరణాలను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. అలాగే జోయాలుక్కా్‌సలో వెండి కొనుగోలు చేయాలనుకుంటున్న వారి కోసం మేకింగ్‌ చార్జీలపై 30 శాతం వరకు రాయితీని ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్‌  దేశవ్యాప్తంగా ఉన్న జోయాలుక్కాస్‌ షోరూమ్‌ల్లో ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా జోయాలుక్కా్‌సలో కొనుగోలు చేసిన ఆభరణాలకు ఏడాది పాటు ఉచిత బీమా, జీవితాంతం ఉచిత మెయింటెనెన్స్‌, బైబ్యాక్‌ గ్యారంటీని అందించనున్నట్లు జోయాలుక్కాస్‌ వెల్లడించింది.

Updated Date - 2021-01-24T07:40:10+05:30 IST