ఘనంగా సహస్ర చండీయాగం ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-19T05:04:03+05:30 IST

ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులోని

ఘనంగా సహస్ర చండీయాగం ప్రారంభం
సహస్ర చండీయాగం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 18: ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులోని వ్యవసాయ క్షేత్రంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దంపతులు చేపట్టిన సహస్ర చండీయాగం గురువారం ఘనంగా ప్రారంభమైంది. మొదటగా చండీ హోమం దీక్ష ధారణ చేశారు. యోగాచార్యులు వెల్లంకి ప్రసాదశర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాగంలో వేద బ్రాహ్మణులచే గణపతిపూజ, పుణ్యావచనం, మాతృకాపూజనం, పంచకన్య ప్రాశన చేశారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆయన సతీమణి ముకుంద, తనయుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి(బంటి), కోడలు మౌనికలు గోమాత, నవగ్రహ మంటపాల పూజలు చేశారు. సాయంత్రం అగ్నిప్రతిష్ఠాపన, చండీహోమంతో ప్రారంభమై గణపతి హోమం, శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. లోకకల్యాణం కోసం ఐదు రోజులపాటు ఈ యాగం నిర్వహిస్తున్నట్ల్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే కూతురు శీతల్‌, అల్లుడు శ్రీకాంత్‌రెడ్డి, ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు, ఆర్డీవో వెంకటాచారి, సీఐ సైదులు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేష్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్రవంతి, వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరి, వైస్‌ ఎంపీపీ వెంకట ప్రతా్‌పరెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు రమేష్‌ గౌడ్‌, చిలుకల బుగ్గరాములు, చీరాల రమేష్‌, కిషన్‌గౌడ్‌, మున్సిపల్‌ అధ్యక్షుడు అల్వాల వెంకట్‌రెడ్డి తదితరులున్నారు.



Updated Date - 2022-08-19T05:04:03+05:30 IST