ఘనంగా మొహర్రం వేడుకలు

ABN , First Publish Date - 2022-08-10T05:02:52+05:30 IST

అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు మండలాల్లో తెల్లవారుజామున అగ్నిగుండం ప్రవేశం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సాయంత్రం విద్యుత్‌ దీపాలు, డప్పు వాయిధ్యాల నడుమ పీర్లను ఊరేగిం పుగా తీసుకెళ్లారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు.

ఘనంగా మొహర్రం వేడుకలు
చిట్వేలిలో పీర్లను ఊరేగింపుగా తీసుకెళ్తున్న చిన్నారులు

రాజంపేట/గాలివీడు/లక్కిరెడ్డిపల్లె/ రైల్వేకోడూరు/చిట్వేలి/సిద్దవటం/ పుల్లంపేట/పెనగలూరు/ఓబులవారిపల్లె /చిన్నమండెం, ఆగస్టు 9: అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు మండలాల్లో తెల్లవారుజామున అగ్నిగుండం ప్రవేశం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సాయంత్రం విద్యుత్‌ దీపాలు, డప్పు వాయిధ్యాల నడుమ పీర్లను ఊరేగిం పుగా తీసుకెళ్లారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు. కాగా రాజంపేటలోని ఆకేపాడులో జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాధరెడ్డి, ఆయన సోదరుడు ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొని పీర్లకు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదానం నిర్వహించారు. అలాగే చిన్నమండెం మండల కేంద్రంలోని మఖాన్‌లో కొలువుదీరిన గంధం పీరుకు మొహర్రం సందర్భంగా టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు సుగవాసి ప్రసాద్‌బాబు ప్రత్యేక పూజలు చేశారు. 



Updated Date - 2022-08-10T05:02:52+05:30 IST