రైస్మిల్లుల్లో ధాన్యాన్ని త్వరగా అన్లోడ్ చేయాలి
ABN , First Publish Date - 2021-05-07T04:03:31+05:30 IST
ధాన్యం లోడ్ మిల్లులకు వచ్చిన వెంటనే అన్లోడ్ చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్ అన్నారు. ఎమ్మెల్యే దివాకర్రావు ఆదేశాల మేరకు గురువారం ఆరు రైస్మిల్లులను పరిశీలించారు.
హాజీపూర్, మే 6 : ధాన్యం లోడ్ మిల్లులకు వచ్చిన వెంటనే అన్లోడ్ చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్ అన్నారు. ఎమ్మెల్యే దివాకర్రావు ఆదేశాల మేరకు గురువారం ఆరు రైస్మిల్లులను పరిశీలించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకున్న రైతులు, రైస్మిల్లు యజమానులు పంటలలోని తాలు, తేమ పేరు చెప్పి కోత విధించవద్దన్నారు. అన్లోడ్ చేయడంలో కాలయాపన జరిగితే అకాల వర్షాల వల్ల రైతులకు నష్టం జరుగుతుందని, రైస్మిల్లు యజమానులు రైతులకు నష్టం కలగకుండా చూడాలన్నారు. రైతులు కూడా తాలు, తేమ లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని రైతులను కోరారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, సభ్యులు అశోక్కుమార్ లడ్డా, కొత్త సురేందర్ పాల్గొన్నారు.