ధాన్యాన్ని తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-05-11T05:27:31+05:30 IST
ధాన్యాన్ని రైస్మిల్లు యాజమాన్యం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మండలంలోని లచ్చపేట గ్రామానికి చెందిన రైతులు మంగళవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
మాచారెడ్డి, మే 10: ధాన్యాన్ని రైస్మిల్లు యాజమాన్యం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మండలంలోని లచ్చపేట గ్రామానికి చెందిన రైతులు మంగళవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. గ్రామంలో ఉన్న రైస్మిల్లుకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని అలాట్ చేసిన రైస్మిల్లుకు డీసీఎంలో తరలించిన మూడు రోజులైనా ఖాళీ చేయకపోవడంతో అ లాగే ఉంచడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చే శారు. ధాన్యం తన రైస్మిల్లులో పెట్టుకునేది లేదని, తాను ధాన్యం తీసుకోనని సదరు రైస్ మిల్లు యజమాని చెప్పడంతో విషయాన్ని స్థా నిక తహసీల్దార్ శ్రీనివాస్ దృష్టికి రైతులు తీసుకెళ్లారు. తహసీల్దార్ చెప్పినా అన్లోడ్ చేసుకోనని రైస్మిల్లర్ చెప్పడంతో మరో రైస్మిల్లుకు ధాన్యం తరలించేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.