రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు
ABN , First Publish Date - 2021-04-23T06:03:04+05:30 IST
రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు.
- జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ
వేములవాడ, ఏప్రిల్ 22: రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. వేములవాడ వవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గడ్డం హన్మాండ్లు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజుతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని, ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించడానికి రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కరోనా వైరస్ నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.