ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2021-04-13T06:08:27+05:30 IST
సొసైటీల ద్వారా చేపడుతున్న ధా న్యం కొనుగోళ్లను వెంటనే వేగవంతం చేయాలని డీసీవో సింహాచలం సొసైటీ అధికారులను ఆదేశించారు.
నవీపేట, ఏప్రిల్ 12 : సొసైటీల ద్వారా చేపడుతున్న ధా న్యం కొనుగోళ్లను వెంటనే వేగవంతం చేయాలని డీసీవో సింహాచలం సొసైటీ అధికారులను ఆదేశించారు. సో మవారం మండలంలోని నాళేశ్వర్, జన్నెపల్లి, నవీపే టలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరి శీలించారు. కొనుగోలు కేంద్రాలలో తరుగు తీయ వద్దని సూచించారు. ఇటీవల పలుచోట్ల అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టిన తరువాత కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్ అ భిషేక్, జిల్లా పౌరసరఫరాశాఖ అధికారి వెంకటేశ్వర్ రావు, ఎంపీపీ శ్రీనివాస్, బినోలా సొసైటీ చైర్మన్ హన్మాండ్లు, నవీపేట సొసైటీ చైర్మన్ అబ్బన్న, నాళేశ్వర్ సర్పంచ్ సరిన్, రైతులు పాల్గొన్నారు.