మండల కేంద్రంలో పట్టపగలే చోరీ

ABN , First Publish Date - 2021-04-21T06:51:28+05:30 IST

మండల కేంద్రమైన నల్లచెరువు షిర్డిసాయి ఆల యం పక్కన ఇంటిలో మంగళవారం పట్టపగలే రూ. 4 లక్షలు విలువ చేసే నాలు గుతులాలు బంగారు, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు బాధితుడు దేవేంద్రరెడ్డి తెలిపారు

మండల కేంద్రంలో పట్టపగలే చోరీ

- నాలుగు తులాలు బంగారు.. వెండి ఆపహరణ 

నల్లచెరువు , ఏప్రిల్‌ 20 : మండల కేంద్రమైన నల్లచెరువు షిర్డిసాయి ఆల యం పక్కన ఇంటిలో మంగళవారం పట్టపగలే రూ. 4 లక్షలు విలువ చేసే నాలు గుతులాలు బంగారు, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు బాధితుడు దేవేంద్రరెడ్డి తెలిపారు. దేవేంద్రరెడ్డి భార్య, పిల్లలు అమ్మగారి వెళ్ళారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో తన ఆరోగ్యం బాగులేక పోవడంతో అతను ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్ళాడు. వైద్యం చేయించుకుని ఇంటికి చేరుకోగా తాళం పగుల కొట్టి బీరువాలో ఉన్న నాలుగు తులాలు బంగారు, వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీసుస్టేషనలో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ మునీర్‌ అహమ్మద్‌, సిబ్బంది ఇంటిని పరిశీలించారు. క్లూస్‌టీం వారిని పిలిపించి వేలిము ద్రలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-04-21T06:51:28+05:30 IST