గ్రేడర్ ఢీకొని యువకుడి మృతి
ABN , First Publish Date - 2022-01-22T05:05:53+05:30 IST
మండల పరిధిలోని బైపాస్ రోడ్డు సమీపం లో రహదారి విస్తరణ పనులు చేస్తున్న ప్రదేశంలో గ్రేడర్ ఢీకొని ఒక యువకుడు మృతిచెందిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
రామభద్రపురం, జనవరి 21: మండల పరిధిలోని బైపాస్ రోడ్డు సమీపం లో రహదారి విస్తరణ పనులు చేస్తున్న ప్రదేశంలో గ్రేడర్ ఢీకొని ఒక యువకుడు మృతిచెందిన సంఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని సోంపురం గ్రామానికి చెందిన కె.జగదీష్ (19) గత కొంతకాలంగా రోడ్డు విస్తరణ పనులకు వెళుతున్నాడు. అయితే గురువారం రాత్రి పని ముగించుకొని, పక్కనే ఉన్న రాళ్ల మధ్య పడుకున్నా డు. అయితే గ్రేడర్ నడుపుతున్న వ్యక్తి జగదీష్ని గమనించకుండా గ్రేడర్ను ఎక్కించాడు. దీంతో జగదీష్ అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లి కాసుదొర గౌరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఎస్.కృష్ణమూర్తి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించామన్నారు. జగదీష్ తల్లిదం డ్రులకు ఒక్కడే కొడుకు కావడంతో వారు బోరున విలపించారు.