దైవానుగ్రహం వారికే!

ABN , First Publish Date - 2021-10-01T05:30:00+05:30 IST

దేవుడి దీవెనలు పొందగలిగేవారెవరు? ఆ అత్యున్నతమైన భాగ్యాన్ని అందుకొగలిగే అర్హత

దైవానుగ్రహం వారికే!

దేవుడి దీవెనలు పొందగలిగేవారెవరు? ఆ అత్యున్నతమైన భాగ్యాన్ని అందుకొగలిగే అర్హత ఎవరికి ఉంది? హృదయపూర్వకంగా కాకుండా పెదవుల చివరి నుంచి వచ్చే ప్రార్థనను దైవం ఆలకించడు. ఆయన ఆశీర్వాదాలు పొందడానికి కావలసింది అపారమైన సంపదలు, ఉన్నతమైన హోదాలు, అధికారం కాదు... నిర్మలమైన చేతులు, స్వచ్ఛమైన హృదయం అని చెబుతోంది పవిత్ర గ్రంథమైన బైబిల్‌. ‘‘యెహోవా పర్వతాన్ని ఎక్కగలిగేవారు ఎవరు? పవిత్రమైన ఆయన స్థలంలో నిలబడగలిగేవారు ఎవరు? అసత్యమైన, మోసపూరితమైన ప్రమాణాలు చేయనివారు... నిష్కళంకమైన చేతులు, స్వచ్ఛమైన హృదయం ఉన్నవారికే యెహోవా ఆశీస్సులు అందుతాయి. రక్షకుడైన దేవుడి నుంచి వారు నీతిని పొందగలుగుతారు’’ అని స్పష్టం చేస్తోంది (కీర్తనలు 24: 3-5) 


చేతులు మన చేతలను ప్రతిఫలిస్తాయి. హృదయం మన అంతరంగంలోని ఆలోచనలనూ, భావాలనూ ప్రతిబింబిస్తుంది. నిర్మలమైన చేతులు అంటే... ఎప్పుడూ మంచి పనులు చేయడం. స్వచ్ఛమైన హృదయం అంటే... ఎల్లప్పుడూ మంచి ఆలోచనలనూ, భావాలనూ కలిగి ఉండడం. అదే విధంగా సత్యాన్ని మాట్లాడాలి. ఎదుటివారిని మోసం చెయ్యడానికి అసత్యాలు మాట్లాడకూడదు. త్రికరణశుద్ధిగా... అంటే మనసా వాచా కర్మణా ధర్మబద్ధంగా జీవించే వారే దైవానికి దగ్గర కాగలరు. ఆయన రాజ్యంలో ప్రవేశించగలరు. ఆయన అనుగ్రహానికి పాత్రులు కాగలరు.

Updated Date - 2021-10-01T05:30:00+05:30 IST