జీపీఎస్ వద్దు.. ఓపీఎస్ ముద్దు!
ABN , First Publish Date - 2022-05-01T23:34:40+05:30 IST
ప్రభుత్వం తెస్తామంటున్న జీపీఎస్ వద్దని, గతంలో ఉన్న ఓపీఎస్(ఓల్డ్ పెన్షన్ స్కీం)నే ముద్దని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నినదించారు.
నెల్లూరు: ప్రభుత్వం తెస్తామంటున్న జీపీఎస్ వద్దని, గతంలో ఉన్న ఓపీఎస్(ఓల్డ్ పెన్షన్ స్కీం)నే ముద్దని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నినదించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో ఆదివారం ఏపీసీపీ ఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోపే సీపీఎస్ను రద్దు చేసి పాతపెన్షన్ను పునరుద్ధరిస్తామని నమ్మించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను మోసం చేశారని వారు మండిపడ్డారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వీఆర్సీ కూడలిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు.