జీపీఎల్ విజేత కొత్తూరు
ABN , First Publish Date - 2021-01-25T05:02:25+05:30 IST
కొత్తూరులో ఈనెల 11 నుంచి ప్రారంభమైన గల్లీ ప్రీమియర్ లీగ్ (జీపీఎల్) క్రికెట్ పోటీ ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. కొత్తూరు, కాశీనగర్ జట్ల మధ్య ఫైనల్ పోటీ సాగగా కొత్తూరు జట్టు విజేతగా నిలిచింది.
కొత్తూరు: కొత్తూరులో ఈనెల 11 నుంచి ప్రారంభమైన గల్లీ ప్రీమియర్ లీగ్ (జీపీఎల్) క్రికెట్ పోటీ ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరిగింది. కొత్తూరు, కాశీనగర్ జట్ల మధ్య ఫైనల్ పోటీ సాగగా కొత్తూరు జట్టు విజేతగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా పి.హరీష్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా బి.హరిష్ నిలిచారు. విజేత జట్టుకు 22222 నగదు, ట్రోఫీ, రెండో స్థానంలో నిలిచిన కాశీనగర్ జట్టుకు 11111 నగదు, ట్రోఫీ అందించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ తులసీవరప్రసాద్, పడాల లక్ష్మణరావు, జనార్దన పాల్గొన్నారు.